పరుగో పరుగు: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిని హైదరాబాద్ కు తరలింపు…

-

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరియు సిబిఐ ల మధ్య గత కొద్ది రోజుల నుండి నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు ఇవ్వడం .. ఆ నోటీసులకు ఏదో ఒక రిప్లై ఇచ్చి అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకాకపోవడం జరుగుతోంది. ఇక తాజాగా ఈరోజు ఉదయం హైద్రాబాద్ లో విఛారణకు వెళ్లాల్సి ఉండగా.. పొద్దున్నే అవినాష్ రెడ్డి తల్లి కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన పులివెందులలోని దినేష్ హాస్పిటల్ కు తరలించారు. ఆమెను చూడ్డానికి మళ్ళీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుండి పులువీధులకు వచ్చాడు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం మార్గమధ్యంలోనే తల్లి ఉన్న అంబులెన్సు ను ఆపి అందులోకి అవినాష్ రెడ్డి మారారట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లారని వార్త.

ఇప్పుడు మళ్ళీ ఆమెను బెంగుళూరు కు తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా ఈ రోజు సిబిఐ విచారణ నుంచి తప్పించుకోవడానికాని స్పష్టంగా అర్ధమవుతోందంటూ కొందరు భావిస్తున్నారు, మరి వాస్తవం ఏమిటో ? అవినాష్ రెడ్డి తల్లికి నిజంగా అనారోగ్యం ఉందా ? లాంటి విషయాలు తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news