ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ లో కీలక అంశాలు.. కాసేపట్లో విచారణ !

-

ఆంధ్రప్రదేశ్ ఎంపీ అవినాష్ రెడ్డి పై వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మెడకు చుట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి 14 రోజులపాటు రిమాండ్ కు తరలించారు. ఈ రోజు అవినాష్ రెడ్డిని సైతం విచారించడానికి సిబిఐ నోటీసులు ఇవ్వగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని హై కోర్ట్ లో పిటీషన్ ను వేశారు. ఈ కేసు విచారణ ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరగనుంది. అయితే అవినాష్ రెడ్డి పిటీషన్ లో కీలక అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ పిటీషన్ ప్రకారం గతంలో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు 161CRPC కింద విచారించారని..

కానీ తాజాగా సిబిఐ ఇచ్చిన నోటీసులో 160CRPC ని పొందుపరిచారని పాయింట్ ను లేవనెత్తారు. అంతే కాకుండా ఈ పిటీషన్ లో నేను నిందితుడని తెలపడానికి ఎటువంటి అధరాలు సిబిఐ వద్ద లేవని పేర్కొన్నారట. మరి కాసేపట్లో జరగనున్న ఈ విచారణలో ఏమి జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news