వైఎస్ వివేకా హత్య కేసు.. వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా అరెస్టు కావడం, ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరు అవుతుండడంతో అసలు ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. నిన్న అరెస్ట్ చేసిన వైయస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా అవినాష్ రెడ్డి సహా.. నిందితుడిగా సిబిఐ పేర్కొంది.

దీంతో వైసిపి నేతలలో కల్లోలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైబి సుబ్బారెడ్డి తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. వైయస్ వివేకా హత్య కేసు కు సంబంధించి తాజా పరిణామాలపై వారితో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news