ప్యాకేజీ పెంచుకోవడానికే చంద్రబాబు – పవన్ భేటీ – ఎంపీ భరత్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్. ప్యాకేజీ పెంచుకోవడానికే చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని ఆరోపించారు. ముసుగు తొలగించి బయటకు రావాలన్నారు భరత్. మీ కుమ్మక్కు రాజకీయాలపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని అన్నారు. మీ భేటీల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదన్నారు భరత్. వీరు సింగిల్ గా వెళతారో, పొత్తుతో వెళతారో తేల్చుకోవాలన్నారు. వైసిపి మాత్రం సింగిల్ గానే వస్తుందన్నారు మార్గాని భరత్.

2014లో చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇచ్చారని? 2019లో ఎందుకు విడివిడిగా పోటీ చేశారని? ఇప్పుడు మళ్లీ ఎందుకు కలవాలి అనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో నివాసం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు లో 11 మంది చనిపోతే పరామర్శించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరు చనిపోయారని చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లారని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news