బీఆర్‌ఎస్‌ ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయలేదు : కేసీఆర్

-

తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదన్న ఎంపీ లక్ష్మణ్ బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.పది జిల్లాలను 33 జిల్లాలు చేశారన్నారు. కానీ కొత్త వ్యవస్థకు సరిపడా ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఓటు వేసేందుకు నిరుద్యోగులు సిద్ధంగా లేరని చెప్పారు.ఈ క్రమంలో యువతకు కొలువులు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలని తెలిపారు. అటు కర్ణాటకలో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.

In tack change, KCR says won't work to create opposition front | India News  - Times of India

టీఎస్‌పీఎస్సీలో ఇరవై లక్షల మంది ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకొని ఆశగా ఎదురు చూస్తున్నారని, నమోదు చేసుకోని యువతను కలిపితే ఆ సంఖ్య యాభై నుండి అరవై లక్షలగా ఉంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. వివిధ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్న విషయాన్ని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతకు ఇప్పటికీ ఉద్యోగాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయలేదన్నారు. డీఎస్సీ ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాక స్కూల్స్ మూతబడే పరిస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మాట తప్పారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news