రాష్ట్రంలో అలజడులు సృష్టించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు : మార్గాని భరత్‌

-

రాష్ట్రంలో అలజడులు సృష్టించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. చంద్రబాబు ముందస్తు వ్యూహం ప్రకారమే పుంగనూరులో అలజడులు జరిగాయని అన్నారు. పోలీసులపై రాళ్ళ దాడికి చంద్రబాబే ఉసి గొల్పి రక్తపాతం సృష్టించారని ఆయన ఆరోపించారు. ముందు ఇచ్చిన రూట్ ప్రకారం కాకుండా మరో రూట్ లో వెళ్తామని చంద్రబాబు అనడంతో పోలీసులు అడ్డుకున్నారని ఎంపీ మార్గానీ చెప్పారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడి చేయించడం అమానుషం.. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు.. టీడీపీ శ్రేణుల దాడులు ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా కనిపిస్తుంది అని ఎంపీ భరత్ ఆరోపించారు.

Margani Bharatram: ఎన్టీఆర్ పై చంద్రబాబు చూపిస్తోంది కపట ప్రేమ - NTV Telugu

కాగా, మంత్రి కారుమూర్తి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ మూకలు విధ్వంసం. సృష్టించారు. ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చంద్రబాబు ఎందుకు వెళ్లలేదు?. బ్లాక్ క్యాట్ కమాండోలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఏం చెప్పాలో తెలియకే ఇలా అలజడులు సృష్టిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం గూండాలను అక్కడికి రప్పించారు అని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news