ఎంపీ రామ్మోహన్ తలపై ముళ్ల కిరీటం..!

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ అధ్యక్ష పదవి పై సంచలన ఆరోపణలు చేశారు. ట్విటర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసిన ఈ వార్తలపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నాదమ్ముల లాంటి తమ మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. మరి విజయ సాయి చేసిన ఈ ట్వీట్ పై లోకేశ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news