ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్‌..”రాధేశ్యామ్‌” కొత్త ట్రైలర్‌కు ముహుర్తం ఫిక్స్‌

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరో గా నటిస్తున్న లెటెస్ట్‌ మూవీ రాధేశ్యాం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చే సింది. ఈ సినిమా కొత్త ట్రైలర్‌ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మేరకు తేదీని కూడా ఫిక్స్‌ చేసి.. అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. రాధే శ్యామ్‌ సినిమా ట్రైలర్‌ ను మార్చి 2 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయానికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా.. రాధే శ్యామ్‌ మూవీ మార్చి 11 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news