వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉంది : లోక్‌సభ స్పీకర్‌ కు సునీతారెడ్డి లేఖ

-

లోక్‍సభ స్పీకర్ ఓం బిర్లా కు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి లేఖ రాశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు లో వైసీపీ పార్టీ ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత రెడ్డి.. తన లేఖలో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పాత్ర పై వెంటనే విచారణ జరిపించాలని స్పీకర్‍ ను ఓం బిర్లాను కోరారు సునీతా రెడ్డి.

అంతేకాదు.. సీబీఐ కి తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచింది సునీత రెడ్డి. సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేసిన సునీత…వెంటనే దీనిపై విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో తనకు న్యాయం జరుగడం లేదని.. మీరైనా దీనిపై స్పందించాలని ఆమె లేఖ ద్వారా స్పీకర్‌ ను విన్నవించారు.

కాగా.. అంతకు ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు లో సునీత రెడ్డి.. ఇచ్చిన వాంగ్మూలం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. వేకానంద రెడ్డి హత్య కేసు లో వైసీపీ పార్టీ ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత రెడ్డి వాంగ్మూలంలో స్పష్టం చెప్పింది. ఈ విషయం జగన్‌ కు తెలిసినా.. చర్యలు తీసుకోలేదని ఆమె వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news