ముంబైకి గట్టి షాక్.. ఐపీఎల్ 2020 నుంచి మలింగ ఔట్..!

-

శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ ఐపీఎల్ 2020కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో తాను ఐపీఎల్‌కు రావడం లేదని చెప్పాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ జట్టు కూడా ధ్రువీకరించింది. మలింగ దూరం కావడంతో అతని స్థానంలో మరో పేసర్‌ను తీసుకున్నట్లు ముంబై జట్టు యాజమాన్యం వెల్లడించింది. దీంతో మలింగ స్థానం ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్‌కు దక్కింది. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ప్యాటిన్సన్‌ను గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ ప్లేయర్ వేలంలో ఏ ప్రాంచైజీ కొనుగోలుచేయలేదు.

ఇకపోతే యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news