WPL : తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం

-

WPL-2023 తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. గుజరాత్ జేయింట్స్ పై 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ముంబై నిర్దేశించిన 2008 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జేయింట్స్ కేవలం 64 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కాగా ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ 4, స్కివర్-బ్రంట్ 2, అమేలీయ కేర్ 2, వికెట్ తీసి ముంబైకి విజయాన్ని అందించారు.

అటు..ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో నేడు ముంబై వేదికగా రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు స్మృతి మందాన నేతృత్వంలోని బెంగుళూరు జట్టు ఢిల్లీ (కెప్టెన్ మేగ్ లానింగ్)తో పోటీ పడనుంది. సాయంత్రం 7:30 నుంచి యూపీ (కెప్టెన్ ఆలీసా హీలి), గుజరాత్ (కెప్టెన్ బెత్ మూని) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్న తొలి మ్యాచ్ లో గుజరాత్ పై ముంబై 143 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news