ఐపీఎల్ 20వ మ్యాచ్‌.. రాజ‌స్థాన్ టార్గెట్ 194..

-

అబుధాబిలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 20వ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై ముంబై ఇండియ‌న్స్ 193 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది.

mumbai made 193 runs against rajasthan in ipl 2020 20th match

ముంబై బ్యాట్స్‌మెన్ల‌లో సూర్య కుమార్ యాద‌వ్ విజృంభించాడు. 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో రాజ‌స్థాన్‌పై విరుచుకు ప‌డి 79 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 35 ప‌రుగులు చేయ‌గా, చివ‌ర్లో హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 30 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ఎస్ గోపాల్ 2 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చ‌ర్‌, కార్తిక్ త్యాగిల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news