రాహుల్ గాంధీతో వేదిక పంచుకున్న ఆరోగ్య మంత్రికి కరోనా..

-

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రాహుల్ గాంధీ, పంజాబ్ రాష్ట్ర రైతులతో కలిసి వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ లో జరిగిన వ్యవసాయాన్ని రక్షిద్దాం అనే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నాడు. రైతులకి వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలని చేసారన్న నేపథ్యంలో సోమవారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆరోగ్య శాఖా మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు కూడా ఉన్నారు.

ఐతే ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖా మంత్రికి కరోనా సోకింది. బల్బీర్ సింగ్ సిద్ధు కరోనా బారిన పడ్డారని వైద్యులు ప్రకటించారు. గొంతునొప్పితో పాటు కొద్దిగా జ్వరం ఉండడంతో టెస్ట్ కి వెళ్ళిన బల్బీర్ సింగ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బల్బీర్ సింగ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news