రేపే మునుగోడు ఓట్ల లెక్కింపు..15 రౌండ్లలో కౌంటింగ్

-

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో గెలుపెవరిదో మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది. మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. నియోజకవర్గంలో గురువారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 2లక్షల 41వేల 805 మందికి గానూ 2లక్షల 25వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్‌ హౌసింగ్‌ గోడౌన్స్‌లో స్ట్రాంగ్‌ రూంను ఏర్పాటు చేశారు. ఈ గోడౌన్స్‌లలోనే రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోలింగ్ ఏజెంట్‌లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా ఇవి పూర్తైన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు.

ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్‌లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కి కౌంటింగ్ సూపర్‌వైజర్ ,అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్‌లను నియమిస్తున్నారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడికానుంది. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంట వరకు విడుదల అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news