మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ పేదల భవిష్యత్తుపై ఆధారపడి ఉంది – బండి సంజయ్

-

మునుగోడు ఉప ఎన్నిక ఒక నియోజకవర్గానికి చెందింది మాత్రమే కాదని.. తెలంగాణ పేదల భవిష్యత్తు ఈ ఉప ఎన్నికపై ఆధారపడి ఉందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డులో బండి సంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కుటుంబ పాలనకు ఆమోదం తెలిపినట్లుు అవుతుందన్నారు.

టిఆర్ఎస్ పార్టీ అడ్డదారిన మునుగోడులో గెలవాలని చూస్తుందనిి ఆరోపించారు. ప్రజలంతా దీన్ని గమనించి బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్. ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంస్కారవంతమైన జీవితాన్ని గడపాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news