గుజరాత్‌ పర్యటనలో అసదుద్దీన్‌ ను అడ్డుకున్న ముస్లింలు..బీజేపీ ఏజెంట్ అంటూ నినాదాలు

-

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీకి ఊహించని షాక్‌ తగిలింది. గుజరాత్‌ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇవాళ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ.. ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో.. ఓవైసీకి… ముస్లిం సంఘాలే షాక్‌ ఇచ్చాయి.

గుజరాత్‌ పర్యటనలో అసుదుద్దీన్‌ ను అడ్డుకున్నాయి ముస్లిం సంఘాలు. బీజేపీ పార్టీ ఏజెంట్‌ అంటూ… అసదుద్దీన్‌ ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి ముస్లిం సంఘాలు. దీంతో ఆయన పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని..  ముస్లిం సంఘాల నేతలను చెదరగొట్టారు.  ఇక చేసేది ఏమీ లేక.. తన పర్యటనను అసదుద్దీన్‌ ఓవైసీ.. ముగించుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఒవైసీ.. అక్కడికి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news