నేను చనిపోయే వరకూ జగన్ తోనే ఉంటాను – నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

-

నేను చనిపోయే వరకూ జగన్ తోనే ఉంటానని తెలిపారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం సరికాదన్నారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మాది రాజకీయ కుటుంబమని.. నా మీద దుష్ప్రచారం చేసిన.. ఆరు సార్లు ఎం.ఎల్.ఏ.గా గెలిచా… మంత్రిగా పనిచేశానని వెల్లడించారు.

మీడియా అంటే నాకు గౌరవం ఉందని… జగన్ నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారని చెప్పారు. 2012లో ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచానని.. నా చివరి రక్తపు బొట్టు వరకూ జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వాళ్ళ ఇంట్లో బిడ్డలా చూసుకుంటున్నారని.. నెల్లూరు బ్యారేజ్ కు మా నాన్న శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారన్నారు. కొందరు ఎం.ఎల్.ఏ.లు డబ్భులు తీసుకుని ద్రోహంఏ చేశారని.. ఈ గేమ్ చంద్రబాబు ఆడుతున్నారని ఆగ్రహించారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. గతంలో ఆయన సి.ఎం.అయ్యేటప్పుడు కూడా ఇదే గేమ్ ఆడాడని మండిపడ్డారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news