కునో పార్క్ నుంచి మరో చీతా జంప్.. భయాందోళనల్లో స్థానికులు

-

నమీబియా నుంచి 12 ఆఫ్రికన్ జాతి చీతాలను భారత్ కు తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఈ చీతాలు నిర్దేశిత ప్రాతం దాటి బయటకు వెళ్తున్నాయి. ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్​ తీసుకురాగానే మరో చీతా నిర్దేశిత ప్రాంతం దాటిపోయింది. ఆశా అనే చీతా కూనో నేషనల్​ పార్కులోని రిజర్వ్​ ఫారెస్ట్ దాటి వీర్​పుర్​ ప్రాంతంలోని బఫర్​ జోన్​లోని వెళ్లిపోయింది. ఆశా ఎక్కువగా బఫర్ జోన్​లోని నదుల వెంట సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఆశాకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ పేరు పెట్టారు.

ఈ చీతాల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికాలు చెబుతున్నారు. చీతాలు జంతువులను వేటాడవని అంటున్నారు. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవని తెలిపారు. కానీ బఫర్​ జోన్​ పరిధిలోని గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news