“మిస్ ఇండియా 2023” గా నందిని గుప్తా..!

-

ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని ఈ సంవత్సరం రాజస్థాన్ కు చెందిన నందిని గుప్త కైవసం చేసుకున్నారు. ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగిన వేడుకలలో సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ముఖ్యులు కూడా హాజరయ్యారు. ఇకపోతే అన్ని పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జడ్జిల హృదయాలను గెలుచుకున్న 19 సంవత్సరాల నందిని గుప్త విజేతగా నిలిచి మిస్ ఇండియా కెరీటాన్ని కైవసం చేసుకున్నారు.

గత ఏడాది మిస్ ఇండియా గా నిలిచిన సినీ శెట్టి విజేత నందిని గుప్తా కు కిరీటాన్ని అలంకరించారు. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా మొదటి రన్నరపుగా నిలవగా.. మణిపూర్ కి చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ సెకండ్ రన్నర్ అప్పుగా నిలిచారు. ఇక ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి గోమతి , తెలంగాణ నుంచి ఊర్మిళా చౌహాన్లు మిస్ ఇండియా పోటీల్లో తుదివరపు పోటీ ఇచ్చారు. ఇక 59వ సెమినా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా ఢిల్లీ తో సహా 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు ఈ కంటెస్టెంట్ లో పోటీపడ్డారు.

ముఖ్యంగా తమ అందంతోనే కాదు ప్రతిభతో కూడా జడ్జిల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మలు తుది పోరులో అదరగొట్టిన నందిని గుప్త కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ వేడుకల్లో సినీ తారలు కార్తీక్ ఆర్యన్ అనన్య పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు 2022 మిస్ ఇండియా విజేత సినీ శెట్టి తో పాటు మరికొంతమంది హాజరై సందడి చేశారు. ఇప్పటికే సినీ శెట్టికి సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి ఇక త్వరలోనే నందిని గుప్తా కి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news