చంద్రబాబు లైవ్ లో ప్రత్యక్షమై షాక్ ఇచ్చిన మనవడు దేవాన్ష్..!

-

కరోనా మహమ్మారి కారణంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితమైపోయారు. నిత్యం ఇంట్లో నుంచే తాజా పరిస్థితులపై జూమ్‌లో వీడియో కాస్ఫరెన్స్ నిర్వహిస్తూ.. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. కాగా తాజాగా.. చంద్రబాబు జూమ్‌లో శుక్రవారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు.. రాష్ట్ర ప్రస్తుత పరిస్తితులపై, అమరావతి అంశంపై మాట్లాడుతున్నారు.. అయితే ఈ ప్రెస్‌మీట్ లోకి ఆయన మనవడు దేవాన్ష్ వచ్చాడు.

ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో తెలియకుండా వచ్చిన దేవాన్ష్.. వెంటనే దాన్ని గమనించి కెమెరాకు దొరక్కుండా జాగ్రత్తగా తాత పక్కకు జరిగాడు. అలా కింద పాక్కుంటూ వెళ్ళి తనకు కావలిసిన అక్బర్ బీర్బల్ పుస్తకం తీసుకుని వెళ్ళిపోతున్నాడు దేవాన్ష్. ఈ వీడియోను కొందరు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news