ఇది ట్రైలర్ మాత్రమే.. వైసీపీకి పెద్ద సినిమా చూపిస్తాం : నారా లోకేష్

-

ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూపించాం.. వైసీపీకి పెద్ద సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. రెండున్నరేళ్లు ఓపిక పడితే చంద్రబాబు సీఎం అవుతారని.. అప్పుడు అందరి పని చెబుతామని పేర్కొన్నారు. 2019 ముందు నాపై ఏ కేసూ లేదు.. ఏ పోలీస్ స్టేషనుకు వెళ్లలేదు.. జగన్ సీఎం అయ్యాక నాపై హత్యాయత్నం సహా 11 కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. జగన్ తరహాలో నేనేం మా చిన్నాన్న జోలికెళ్లలేదని.. జగన్ మగాడైతే చిన్నాన్న హత్య కేసును తేల్చాలని డిమాండ్ చేశారు.

హత్యాయత్నం కేసులు పెడితే నా బండి ఆగదు.. మరింత స్పీడుగా వెళ్తుందని హెచ్చరించారు నారా లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడుతోన్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. 2024 లో మంగళగిరిలో భారీ మెజార్టీ తో గెలిచి చంద్రబాబు కు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు.

పార్టీ కార్యాలయం పై దాడి చేయండని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారు.. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారని మండిపడ్డారు. కొన్ని పిల్లులు పులులమను కుంటున్నాయని.. ఒక చెంప కొడితే రెండు చెంపలు కొడతామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని.. ఏపీలోనే కాదు.. దేశంలో ఎక్కడున్నా వదిలి పెట్టమన్నారు. మా పార్టీ కార్యాలయంలో పగిలినవి.. అద్దాలే మా కార్యకర్తల గుండెలు బద్దలు కొట్టలేరన్నారు. మాది పేటీఎం బ్యాచ్ కాదు.. పసుపు సైన్యమని పేర్కొన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news