జగన్‌ ఓ నియంత..అమ్మ లాంటి అమరావతిని కూల్చాడు : నారా లోకేష్

-

జగన్‌ ఓ నియంత..అమ్మ లాంటి అమరావతిని కూల్చాడని నారా లోకేష్ ఫైర్‌ అయ్యారు. నియంతగా మారిన పాల‌కుల విద్వేష నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా 800 రోజులుగా జై అమరావతి ఉద్యమం నడుస్తోందని నిప్పులు చెరిగారు. మొక్క‌వోని దీక్ష‌తో పోరాడుతున్న‌ రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు అన్నారు. రాష్ట్రానికి అమ్మ లాంటి అమరావతిని కూల్చాలని కుట్ర చేసిన జగన్ అన్ని రంగాల‌ని కుప్పకూల్చాడని ఆగ్రహించారు.

సంకుచిత బుద్దితో జగన్ అండ్ కో చేసిన ప్రతీ ఆరోపణ అబద్ధమేనని నిరూపిస్తూ అమరావతి ఠీవిగా నిలబడిందని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆపేసిన అమరావతి గ్రోత్ ఇంజిన్ ని తిరిగి స్టార్ట్ చెయ్యడం ఒక్కటే మార్గం మని చెప్పారు అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని… 800 రోజుల రాజధాని పోరాటానికి అభినందనలన్నారు.

రాజధాని ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని.. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న సీఎంను దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నామని స్పష్టం చేశారు. మూర్ఖపు వైఖరి తో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపేసిన సీఎం జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news