రూ. 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కొన్నాడు… ఇప్పుడు సంపాదిస్తున్నాడు: నారా లోకేష్

-

యువగలం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్రము అంతటా పాదయాత్ర చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో ఎంటర్ అయిన లోకేష్ స్థానిక ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. వైసీపీ తరపున వరప్రసాద్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే లోకేష్ చెబుతున్న ప్రకారం ఈయన ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్ కు రూ.100 కోట్లు ఇచ్చాడట. అందుకే ఇప్పుడు గూడూరు వేదికగా చిల్లకూరు దగ్గర గ్రావెల్ ఖ్వారీలో దోపిడీ చేసి రూ. 100 కోట్లు సంపాదించాడని ఆరోపించారు. ఈ ఆరోపణలను కోట లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చేశారు. ఈ తరహా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలే లోకేష్ పై విమర్శలు చేసే పరిస్థితి అని చెప్పాలి.

ఇక సీఎం జగన్ పైన సైతం ఆరోపణలు చేయడం విశేషం, ఏకంగా విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో రూ. 5000 కోట్ల సిలికా గనుల ద్వారా దోచుకున్నాడని సీఎం జగన్ పై ఆరోపించాడు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news