ఏమీ దొర‌క్కపోతే గుడిని, గుడిలోని లింగాన్ని దోచుకుంటున్నారు : నారా లోకేష్‌

-

వైసీపీ అధినేత రాష్ట్రంపై ప‌డి ప్రజాధ‌నం దోచుకుంటుంటే, వైసీపీ నేత‌లు ఊర్ల‌మీద ప‌డుతున్నారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. ఏమీ దొర‌క‌పోతే గుడిని, గుడిలోని లింగ‌మూ దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. జ‌గ‌న్‌ అధికారం చేప‌ట్టిన నుంచి వైసీపీ ముఠాలే హిందూ ఆల‌యాల‌పై దాడులు చేసి టీడీపీపై ఆరోప‌ణ‌లు చేశారన్నారు. వైసీపీ కొల్లగొట్టిన విగ్ర‌హాలలో ఒక‌టి వైసీపీ నేత ఇంట్లో మ‌ర‌కత‌ వినాయ‌కుడి రూపంలో బ‌య‌ట‌ ప‌డిందని, ప్ర‌కాశం జిల్లాకి చెందిన ఛోటా వైసీపీ నేత వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి ఇంట్లో రూ. 25 కోట్ల విలువ‌ చేసే మ‌ర‌క‌త విగ్ర‌హం బ‌య‌ట‌ప‌డిందంటే వైసీపీ పెద్ద నేత‌ల ఇళ్ల‌ల్లో ఇంకెన్ని పురాత‌న విగ్ర‌హాలున్నాయో? అని ఆయన విమర్శించారు.

Nara Lokesh slams YSRCP's 'unsparing attacks' on police

ఇదే కాదు రాష్ట్రంలో అన్ని దేవాల‌యాల్లోనూ వైసీపీ నేత‌లు న‌గ‌లు, విగ్ర‌హాలు ఎత్తుకుపోతున్నార‌ని భ‌క్తుల‌లో అనుమానాలున్నాయని, అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం, దుర్గ‌మ్మ వెండి సింహాల మాయం, రామ‌తీర్థం రాముడి త‌ల న‌రికివేత ఘ‌ట‌న‌లో ఈ రోజుకీ నిందితులు దొర‌క‌లేదన్నారు.వెంక‌టేశ్వ‌ర రెడ్డిలాంటి వైసీపీ నేత‌ల ద‌గ్గ‌ర విగ్ర‌హాలు దొరుకుతున్నాయని, ఈ దొంగ ప్ర‌భుత్వం, దోపిడీ పాల‌కుల హ‌యాంలో ప్ర‌జ‌ల‌కే కాదు, దేవాల‌యాల ఆస్తుల‌కు, దేవ‌తా విగ్ర‌హాల‌కు ర‌క్ష‌ణ‌ లేకుండా పోయిందని ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని దేవాల‌యాలు అన్నింట్లో అర్జంటుగా కేంద్ర‌ బృందంతోగానీ, న్యాయ బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆడిట్ జ‌ర‌పాలని, లేదంటే దేవుళ్ల న‌గలు, విగ్ర‌హాలు వైసీపీ నేత‌లు పిల్ల‌ల మెడ‌లో ఆభ‌ర‌ణాలుగా మారే ప్ర‌మాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news