అన్నం తినే వాళ్లెవ్వరూ…అన్న క్యాంటీన్ ని అడ్డుకోరు – నారా లోకేష్

-

అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ ని అడ్డుకోరని నారా లోకేష్‌ ఆగ్రహించారు. జగన్ రెడ్డి గారు తింటుంది ఏంటో ఆయనే తేల్చుకోవాలని చురకలు అంటించారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారు. ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని మండిపడ్డారు.

జగన్ రెడ్డిలో మానవత్వం అనేదే లేదా? తెనాలి లో అన్న క్యాంటీన్ కి అడ్డుపడటం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతాం. పేద వాళ్ళ ఆకలి తీరుస్తామని స్పష్టం చేశారు.ఇంకెన్నాళ్లీ నెత్తుటి రాజ‌కీయాలు చేస్తారు జ‌గ‌న్‌రెడ్డి గారు! మా పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ గారి పై దాడికి తెగ‌బ‌డింది మీ వైసీపీ ఫ్యాక్ష‌న్ మూక‌లే. అధికారం శాశ్వ‌త‌మ‌నుకుని పోలీసుల సాయంతో ర‌క్త‌చ‌రిత్ర రాస్తున్నావు. మా స‌హ‌నం చేత‌కానిత‌నం కాదు. తిరుగుబాటు మొద‌ లైందని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news