ఏపీ రోడ్లపై లోకేష్ సెటైర్లు..”జగనన్న గుంతల పథకం” అంటూ !

-

ఏపీ రోడ్లపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జగనన్న గుంతల పథకం” అంటూ చురకలు అంటించారు నారా లోకేష్‌. యువగళం పాదయాత్ర 32వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల ఆదరాభిమానాల మధ్య చాలా ఉత్సాహంగా కొనసాగింది. బందార్లపల్లెలో ఓ రోడ్డు మీద “జగనన్న గుంతల పథకం”తో ఒక సెల్ఫీ తీసుకున్నానని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

గత 4 ఏళ్లుగా రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కులేదని జనం నాతో చెప్పారన్నారు నారా లోకేష్‌. ఉపాధ్యాయులు, యూటిఎఫ్, ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యానని…. టీచర్లు ఇంత ఒత్తిడికి గురవ్వడం, మనోవ్యధ చెందడం నేను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదని… వేలకోట్ల బకాయిలను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేసారని తెలిపారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news