జగన్‌ కు ఎక్స్‌పెయిరీ డేట్ దగ్గర పడింది – నారా లోకేష్‌ సంచలనం

-

జగన్‌ కు ఎక్స్‌పెయిరీ డేట్ దగ్గర పడిందని నారా లోకేష్‌ సంచలన ప్రకటన చేశారు. ఉమా మహేశ్వరి మృతిపై వైసీపీ చేసిన కామెంట్లకు కౌంటర్‌ గా నారా లోకేష్‌ స్పందించారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ రెడ్డి తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. డోర్‌ నెంబర్ కి సర్వే నెంబర్ కి తేడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విష‌ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ న‌టన, ఒకే కులం డిఎస్పీలు 35 మందికి ప్ర‌మోష‌న్లు, పింక్ డైమండ్ పేరుతో చేసిన అస‌త్య విష‌ప్ర‌చార‌మే..నేడు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి నా చిన్న‌మ్మ ఉమామ‌హేశ్వ‌రి గారి మ‌ర‌ణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారని చురకలు అంటించారు.

తండ్రి శ‌వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాల‌ని సంత‌కాలు చేసిన నీచ చ‌రిత్ర గ‌లిగిన జ‌గ‌న్‌రెడ్డి, ఎన్నిక‌ల్లో సానుభూతి కోసం బాబాయ్ మ‌ర్డ‌ర్‌నీ వాడుకున్నారన్నారు. జ‌నాన్ని దోచి దాచుకుని, నెత్తుటి కూడు తింటూ, త‌ర‌త‌రాల‌ ర‌క్త‌చ‌రిత్రకి వార‌సుడైన జ‌గ‌న్‌రెడ్డీ…చిన్న‌మ్మ మ‌ర‌ణంతో మేము విషాదంలో వుంటే విష‌ప్ర‌చారం చేస్తూ వినోదం పొందుతావా? నీ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గ‌ర ప‌డింది. మీరు చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news