నేడు ఇసుక కొరతపై నారా లోకేష్ పోరాటం..

-

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై ఆందోళనలు చేపడుతోన్న తెలుగుదేశం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనుంది. అయితే, టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ … నేడు మాత్రం దీక్ష చేపట్టనున్నారు.

ఏపీలో ఇసుక కొరతనపై ఆయన నిరసన చేపట్టనున్నారు. ఏపీలో ఇసుక విధానంపై జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా దీక్షకు దిగుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గుంటూరు కలెక్టరేట్ ముందు నేడు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటలకు లోకేష్ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news