జగనన్న జైలు పిలుస్తోంది పథకం.. చిప్పకూడు తినడం ఖాయం !

-

ఏపీలో నేడు ఇళ్ళ పట్టాల పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. పేదలకది సెంటు స్థలం కానీ వైఎస్ జగన్ కు, వైకాపా ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం.స్థల సేకరణ లో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చడం చేశారని ఆయన ఆరోపించారు. మొత్తంగా పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లు అని ఆయన ఆరోపించారు.

టిడిపి హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రానా సైకిల్ బ్రాండ్ చేరిగిపోదని లోకేష్ అన్నారు. నీ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డి తో పాటు చిప్పకూడు తినడం ఖాయనాబు అన్నారు. ఇప్పటి వరకూ టిడిపి కేసుల వలనే స్థలం ఇవ్వలేక పోతున్నాం అన్నావ్ మరి ఇప్పుడెలా ఇస్తున్నావ్ జగన్ రెడ్డి, అందుకే నిన్ను ఫేక్ సిఎం అనేది అంటూ ఆయన వరుస ట్వీట్ లు చేశారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news