BREAKING : “భీమ్లా నాయక్‌” సినిమాపై నారా లోకేష్‌ సంచలన ట్వీట్‌..నేను సినిమా చూస్తా

-

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన “భీమ్లా నాయక్‌” సినిమా ఇవాళ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా విడుదల నేపథ్యంలో.. టీడీపీ పార్టీ యంగ్‌ లీడర్‌ నారా లోకేష్‌ సంచలన ట్వీట్‌ చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ పన్నుతున్న కుట్రలను “భీమ్లా నాయక్‌” ఛేదించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

“భీమ్లా నాయక్‌” సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని…. తాను మూవీ చూడాలని ఎదురు చూస్తున్నానని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమపై ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో చాలా పరిశ్రమలు, వ్యవస్థలను నాశనం చేసిన జగన్‌… ఇప్పుడు సినీ పరిశ్రమ కూడా నాశనం చేసేలా వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. కానీ “భీమ్లా నాయక్‌” సినిమా అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు టీడీపీ పార్టీ నేత నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news