బాబుకు బ్యాడ్ న్యూస్… జగన్ కృషి ఫలిచింది!

-

గాంధీ జయంతి రోజున చంద్రబాబుకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపించింది! అనుభవం లేని వ్యక్తి, పరిపాలనపై అవగాహన లేని వ్యక్తి అని వైఎస్ జగన్ ని ఉద్దేశించి ఇప్పటికీ చంద్రబాబు మాట్లాడుతూనే ఉంటారు! మీకు చేతకాకపోతే మూడు నెలలు మా నాయకుడిని ఆ కుర్చీ ఇవ్వండి.. గాడిలో పెట్టి ఇస్తారు అంటూ బోండా ఉమ లాంటి టీడీపీ నేతలు జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు! కానీ… నేడు కేంద్రప్రభుత్వం ఏపీ సర్కార్ భేష్.. జగన్ శభాష్ అంటూ అవార్డులు ప్రకటించింది!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుసగా మూడు అవార్డులు దగ్గ్కించుకుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్ దివస్ కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ కేటగిరీలో రెండో ర్యాంకు సముదాయక్ శౌచాలయ అభియాన్ కేటగిరీలో మూడవ ర్యాంక్ దీంతో పాటు గంధగి ముక్త్ భారత్ కేటగిరీలో మూడవ ర్యాంక్ లభించింది.

జాతీయ స్థాయిలో ఏపీకి ఇలా మూడు అవార్డులు రావడం వెనుక సీఎం జగన్ కృషి ఎంతో దాగివుందని జాతీయ మీడియా ప్రశంసించింది! ఏపీలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమల్లోకి తీసుకొచ్చిన “గ్రామ సచివాలయ వ్యవస్థ” మంచి ఫలితాలని ఇచ్చిందని అభిప్రాయపడింది! కాగా గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఇన్ని ర్యాంకులు దక్కలేదు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news