100 డేస్.. 370 సీట్స్ : పీఎం మోడీ

-

నవ భారత్ నిర్మాణం కోసం అహర్నిశలు పని చేద్దామని బీజేపీ శ్రేణులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ మండలి రెండో రోజు సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోడీ. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఓటరు వద్దకు వెళ్లాలని.. వచ్చే 100 రోజులు బీజేపీకి ఎంతో కీలకం అన్నారు. అందరం కలిసి కొత్త ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. ఈసారి 370 సీట్లు గెలవాలి. ఎన్టీఏకు 400కి పైగా సీట్లు వస్తాయన్నారు. గత పదేళ్లలో దేశ రూపు రేఖలు మొత్తం మారిపోయాయని తెలిపారు. రాబోయే ఐదేళ్లు మనకు చాలా కీలకమన్నారు.

తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమో ముఖ్యమని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. సబ్ కా సాత్, సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరినీ కలిసి బీజేపీ గురించి వివరించాలని తెలిపారు. కొందరూ నన్ను విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఛత్రపతి శివాజీ నాకు స్ఫూర్తి. నాకు వ్యక్తిగత ప్రతిష్ట, అధికారం, కుటుంబం కూడా ముఖ్యం కాదు. దేశ ప్రజలే నా కుటుంబం అని పేర్కొన్నారు మోడీ. ఉగ్రవాదం, అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేశామని వివరించారు. 

Read more RELATED
Recommended to you

Latest news