కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

-

ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఓ అభ్యర్థి చేసిన ప్రయత్నం వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని రెండు గ్రామాల్లో చోటుచేసుకుంది.

కల్తీ మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని ఫుల్​గఢ్,​ శివగఢ్​​ గ్రామాల్లో చోటుచేసుకుంది. ఫుల్‌గఢ్ గ్రామానికి చెందిన రాజు, భోలా అనే ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో మృతుడు మనోజ్.. శివగఢ్​కు చెందినవాడు. జాలీ గ్రాంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించగా.. రిషికేశ్​​లోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

హరిద్వార్​లో పంచాయతీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండడం వల్ల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం సరఫరా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ప్రజలకు మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news