ఇంట్లో బంగారు నిధి.. పంచుకున్న కూలీలు.. మద్యం మత్తులో చివరకు..

-

ఓ పాడుబడిన ఇంటికి మరమ్మతు చేస్తుండగా పురాతన బంగారు నాణేలు. అరుదైన ఆభరణాలు బయటపడ్డాయి. వాటిని చూసిన కూలీలు గుట్టుగా పంచుకున్నారు. కానీ మద్యం మత్తులో ఓ వ్యక్తి నోరు జారడంతో దొరికిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగింది.


ధార్‌లోని ఓ పురాతన ఇంటిని కూల్చి అక్కడ కొత్త ఇంటిని నిర్మించేందుకు యజమాని కొందరు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటిలోని కొంతభాగాన్ని కూల్చి శిథిలాలను తరలిస్తుండగా.. ఆ కూలీలకు బంగారంతో కూడిన లోహపు పాత్ర లభించింది. అందులో పురాతన బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని వారు బయటకు పొక్కనీయలేదు. యజమానికి తెలియకుండా ఆ ఎనిమిది మంది పంచుకున్నారు.

ఓ కూలీ తాజాగా నాణేన్ని అమ్మేశాడు. వచ్చిన రూ.56వేలతో కొన్ని సరుకులు, ఓ ఫోన్‌ కొనుక్కున్నాడు. తర్వాత ఫుల్‌గా తాగి , ఆ మైకంలో తమకు దొరికిన బంగారు నిధి గురించి మిత్రులకు చెప్పాడు. ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కూలీలందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నాణేలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొంటుండగా.. పురావస్తు శాఖకు చెందిన అధికారులు మాత్రం రూ.1.25కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news