అర్నబ్ గోస్వామి అరెస్ట్…!

-

2018 లో ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ మరణానికి సంబంధించి రిపబ్లిక్ టెలివిజన్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర సిఐడి బుధవారం తన ఇంట్లో అదుపులోకి తీసుకుంది. గోస్వామిని ఇప్పుడు అలీబాగ్‌ కు తీసుకెళ్తామని ఒక సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. ముంబైలో గోస్వామిపై టిఆర్‌పి కుంభకోణం విషయంలో దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది.

53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ 2018 మేలో అలీబాగ్లో ఆత్మహత్య చేసుకోగా… ఒక సూసైడ్ నోట్ ని పోలీసులు పట్టుకున్నారు. అందులో గోస్వామి మరియు మరో ఇద్దరి పేర్లు ఉన్నాయి. అతనికి 5.40 కోట్ల రూపాయలు చెల్లించలేదు అందుకే అతను ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news