వద్దని వారించినా వర్షంలోనూ పనులు.. కుప్పకూలిన బ్రిడ్జ్

-

ఏకధాటి వర్షాలు కురుస్తున్నందున బ్రిడ్జి నిర్మాణం కొన్నిరోజుల వరకు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. అయినా పట్టించుకోని కాంట్రాక్టర్ నిర్మాణాన్ని కొనసాగించారు. కానీ వర్షం ధాటికి ఆ వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘన ఛత్తీస్​గఢ్​లోని దుర్గ్​ జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన అధికారులు.. వంతెన కాంట్రాక్టర్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

దుర్గ్ జిల్లా ధమ్​ధా మండలంలోని సిల్లి, నన్​కట్టి గ్రామాలను కలిపేందుకు శివ్​నాథ్​​ నదిపై సాగ్ని ఘాట్ వద్ద ఓ వంతెన నిర్మిస్తున్నారు. పిల్లర్లపై స్టేజింగ్​, షట్టరింగ్​ పనులు పూర్తి చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొగ్రా రిజర్వాయర్​ నిండగా.. శివ్​నాథ్​​ నదిలోకి నీటిని విడుదల చేశారు. నీటిమట్టం పెరిగి వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. బ్రిడ్జ్​ కూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైళ్లలో బంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్​ కాగా.. అధికారులు స్పందించారు. తాజా ఘటనతో బ్రిడ్జ్​ పనులు మరింత జాప్యం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news