తిరుగుబాటు చేసిన మంత్రులపై సీఎం ఉద్ధవ్ థాక్రే వేటు.. తొమ్మిది మంది మంత్రులను శాఖలనుంచి తొలగింపు

-

తిరుగుబాటు చేసిన మంత్రులపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వేటు వేశారు. తొమ్మిది మంది మంత్రుల శాఖలను తొలగించి వాటిని ఇతర మంత్రులకు అప్పగించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశారు. “ఎనిమిది మంది మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరు. దీంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు స్తంభించి పోవడానికి వీలు లేదు. అందువల్ల వారి బాధ్యతలను ఇతర మంత్రులకు అప్పగిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏక్నాధ్ షిండే ఆధ్వర్యంలో అస్సాంలోని గౌహతి క్యాంపులో ఉన్నారు. ఇప్పటివరకు తిరుగుబాటు నేత ఏక్నాధ్ షిండే పరిధిలో ఉన్న పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖ లో మరో మంత్రి సుభాష్ దేశాయి కు అప్పగించారు. గులాబ్ రావ్ పాటిల్ నుంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖను తొలగించి.. మరో మంత్రి అనిల్ కు అప్పగించారు. మరో ఆరుగురి శాఖలను కూడా మార్చారు. దీనిపై తిరుగుబాటు మంత్రుల నుంచి ఇంకా స్పందన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news