మదర్సాలలో జాతీయ గీతం ఆలపించాల్సిందే కీలక నిర్ణయం తీసుకున్న సీఎం యోగీ

-

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దులో ఉన్న గుర్తింపు లేని మదర్సాలపై ఆపరేషన్ మొదలుపెట్టారు యోగీ. గుర్తింపు లేని మదర్సాల స్థితిగతులను, ముఖ్యంగా వాటి ఆదాయ వనరులను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.సరిహద్దులోని 9 జిల్లాలను సందర్శించి పూర్తి స్థాయి నివేదికలను రూపొందించడం ఈ అధికార బృందం బాధ్యత. నివేదికలోని అంశాలను బట్టి వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఇది. అయితే సీఎం యోగీ చేపట్టిన ఈ తాజా కార్యక్రమం పై పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు.

YOGI

గతేడాది యోగీ ప్రభుత్వం మదర్సాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పెద్ద సంఖ్యలో గుర్తింపు లేని మదర్సాలు ఉన్నట్లు తేలింది.ఇందులో సుమారు ఎనిమిదిన్నర వేల మదర్సాలకు గుర్తింపు లేనట్లు అధికారులు నిర్దారించారు. అంతేకాదు ఈ సర్వేలో జకాత్ (విరాళం) ఈ మదర్సాల ఆదాయ వనరుగా చెప్పబడింది. కొన్ని మదర్సాలకు విదేశాల నుంచి కూడా డబ్బులు వస్తున్నాయని తేలింది. ఈ సారి సర్వే చేస్తున్న అధికారులు ప్రధానంగా మదర్సాల ఆదాయ వనరులపై అరా తీస్తున్నారు.బలరాంపూర్, సిద్ధార్థనగర్, మౌ, బహ్రైచ్, శ్రావస్తిలో పిలిభిత్, అజంగడ్,లఖింపూర్ ఖేరీ వంటి ప్రాంతాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు.జులై 15 నాటికి సర్వే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

YOGI

ఓ వైపు సర్వే జరుగుతుండగా ముఖ్యమంత్రి యోగీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మదర్సాలలో జాతీయ గీతం ఆలపించాలని ఇదివరకే సీఎం చెప్పి ఉన్నారు.తరగతుల ప్రారంభానికి ముందు జనగణమన గీతం ఖచ్చితంగా పాడాలని గతంలో ఆదేశాలిచ్చారు.విద్యార్థుల్లో జాతీయ ఐక్యతను ఈ విధానం తీసుకువస్తుంది అనేది సీఎం అభిమతం. అయితే ఈ ఆదేశాన్ని మదర్సాలు పాటిస్తున్నాయో లేదో గమనించాలని అధికారులకు మరోసారి గుర్తు చేశారు ముఖ్యమంత్రి.ఆదేశాలు పాటించని మదర్సాలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.అలాగే మదర్సాలపై జాతీయ జెండా ఎగరాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news