భారత్ పై కరోనా పంజా.. 24గంటల్లో భారీగా పెరిగిన కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 94,372  పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,114 మంది మరణించారు. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 47,54,357 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 78,586 కి పెరిగింది.

 

నిన్న 78,399 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 37,02,595 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,73,175 యాక్టివ్  కేసులున్నాయి. అలాగే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,71,702  పరీక్షలు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 5,62,60,928 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ICMR వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news