ఇండియాలో కొత్తగా 4272 కరోనా కేసులు, 27 మరణాలు నమోదు

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4272 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,83,360 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 40,750 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.1 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 27 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,611 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4474 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,40,13,999 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 21 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news