ఇండియాలో కొత్తగా 1134 కరోనా కేసులు, 5 మరణాలు

-

BREAKING : ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1134 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,98,118 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,026 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.99 శాతంగా ఉంది.

ఇక దేశంలో 4 గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,806 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 479 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,60,279 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,65,21,180 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 11300 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. కాగా.. ఇవాళ కరోనా మహమ్మారి నివారణపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ కరోనా మహమ్మారి నివారణపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఎదుర్కొనేందుకు కావాల్సిన సన్నద్ధత పై సమీక్ష చేయనున్నారు ప్రధాన మంత్రి మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news