అతి తీవ్ర తుఫాన్‌గా మోఛా.. బెంగాల్‌లో హై అల‌ర్ట్‌

-

మోఛా తుపాన్ ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిప్రభావం బంగాళాఖాతం తీర ప్రాంతంపై పడనుందని వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ అప్రమత్తమైంది. మోఛా తుపాన్ ప్రభావితం చేస్తుందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ఆ రాష్ట్రంలో 200 మంది రెస్క్యూ సిబ్బందితో రెడీగా ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ సెకండ్ బెటాలియన్ కమాండెంట్ గుర్మిందర్ సింగ్ తెలిపారు. మరోవైపు బెంగాల్ తీర ప్రాంతంలో ఇండియ‌న్ కోస్టు గార్డు ద‌ళం కూడా హై అల‌ర్ట్‌లో ఉంది.

బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ బోర్డ‌ర్ వ‌ద్ద ఆ తుపాను తీరం దాటే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గంట‌కు సుమారు 160 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీయ‌నున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ కోక్స్ బ‌జార్ ప్రాంతంలో రెండు మీట‌ర్ల మేర వ‌ర్షం ప‌డే ఛాన్సు ఉంద‌ని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఈశాన్యం దిశ‌గా వెళ్ల‌కూడ‌ద‌ని జాల‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అల‌ర్ట్ జారీ చేశారు. అండ‌మాన్ నికోబార్ దీవుల్లోనూ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. త్రిపుర‌, మీజోరంలో భారీ స్థాయిలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని.. నాగాలాండ్‌, మ‌ణిపూర్‌, సౌత్ అసోంలో స్వ‌ల్ప స్థాయిలో వ‌ర్షం కుర‌వ‌నున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news