సర్కార్ ఉద్యోగులకు శుభవార్త..​ డీఏ 4శాతం పెంపు

-

సర్కార్ ఉద్యోగులకు కేంద్రం త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న కరవు భత్యం(డీఏ)ను నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో 38 శాతంగా ఉన్న కరవు భత్యం 42 శాతానికి పెరగుతుంది. ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని జనవరి 1 నుంచే వర్తింపచేయనున్నట్లు సమాచారం. దీని ద్వారా కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

“2022 డిసెంబర్​కు సంబంధించిన పరిశ్రమ కార్మికుల ద్రవ్యోల్బణ నివేదికను జనవరి 31న కార్మిక శాఖ విడుదల చేసింది. అందులో ఉన్న ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే 4.23 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం డెసిమల్​ పాయింట్​ను పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నాం” అని ఆల్​ ఇండియా రైల్వేమెన్​ ఫెడరేషన్​ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అభిప్రాయపడ్డారు. గతేడాది సెప్టెంబర్​లో నాలుగు శాతం పెంచడం వల్ల కరవు భత్యం 38 శాతానికి చేరింది. పెంచిన డీఏను 2022 జులై 1 నుంచి అమలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news