జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

-

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాది ఉన్నారు. మహమ్మద్ ఇస్మాల్ ఆల్వీ అలియాస్ లంబుు, అద్నన్‌లు జైష్ చీఫ్ మసూద్ అజర్‌ కుటుంబానికి చెందిన వారు. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ఇస్మాల్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. పుల్వామా ఉగ్రదాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) చార్జ్‌షీట్‌లో అతని పేరు కూడా ఉన్నది. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉన్నది.

పుల్వామాలోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎదురు కాల్పుల్లో ఇస్మాల్ ఆల్వీతోపాటు మరో ఉగ్రవాది హతమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news