పుల్వామాలో కార్డన్ సెర్చ్… ముగ్గురు ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.

-

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ప్రాంతం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఉగ్రవాదులు పోలీసు ఆఫీసర్లని కాల్చివేయడం చర్చనీయాంగా మారింది. ఇప్పటికే ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు వదిలారు. పోలీసులకి, ఉగ్రవాదులకి మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చివేసారు. ఆ ఉగ్రవాదులు ఎవరన్నది తెలియదు. గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేసారు.

కార్డన్ సెర్చ్ లో భాగంగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు వెళ్ళిన భద్రతా దళాలు, ఉగ్రవాదులు తుపాకులు ఎక్కుపెట్టడంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చింది. దీంతో కార్డన్ సెర్చ్ కాస్త ఎన్ కౌంటర్ గా మారిపోయింది. ఈ మేరకు భద్రతా దళాల అధికారులు, గుర్తు తెలియని ముగ్గురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ అయ్యారని సమాచారం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news