అధిక పింఛను దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?

-

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు కేంద్ర సర్కార్ తీపికబురు చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) చందాదారుల అధిక పింఛను కోసం దరఖాస్తు చేసుకొనే గడువును జూన్‌ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా విధించిన గడువు ఈ నెల 3(బుధవారం)తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈమేరకు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.

సుప్రీంకోర్టు గతేడాది నవంబరు 4న జారీచేసిన ఆదేశాలను అనుసరించి ఈపీఎఫ్‌ఓ పింఛనుదారుల నుంచి ఆప్షన్‌ వాలిడేషన్‌, జాయింట్‌ ఆప్షన్‌ దరఖాస్తులను స్వీకరించడానికి ఆన్‌లైన్‌ ద్వారా ఏర్పాట్లు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన పింఛనుదారులంతా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో గడువు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది. దరఖాస్తుల అప్‌లోడ్‌లో ఇప్పటివరకు పింఛనుదారులు, చందాదారులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, ఉద్యోగులు, యాజమాన్యాలు, వారి సంఘాలు ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా కూడా జూన్‌ 26 వరకు దరఖాస్తుకు సమయమివ్వాలని భావించినట్లు ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news