రస్నా వ్యవస్థాపకుడు అరీజ్‌ పిరోజ్‌షా కన్నుమూత

-

ప్రముఖ పారిశ్రామికవేత్త, రస్నా గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆరీజ్ పిరోజ్ షా కంబట్ట (85) కన్నుమూశారు. రస్నా ఫౌండేషన్, ఆరీజ్ కంబట్ట బెనోవాలెంట్ ట్రస్ట్ లకు కూడా ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

వయో కారణాలతో ఆయన శనివారం మరణించారని సోమవారం రస్నా గ్రూప్ ప్రకటించింది. గతంలో ఆయన వాపిజ్ చైర్మన్ గా, అహ్మదాబాద్ పార్సి పంచాయతీకి అధ్యక్షుడిగా, ఫెడరేషన్ ఆఫ్ పార్సి జురాస్ట్రియన్ అంజుమాన్స్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. “భారతీయ పరిశ్రమ, వ్యాపారం, ముఖ్యంగా సామాజిక సేవ ద్వారా సామాజిక అభివృద్ధికి కంబట్ట ఎంతో సాయం చేశారు” అని కంపెనీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news