తండ్రికి ఇంట్లోనే సమాధి కట్టేశాడు…!

-

నేను మరణించిన తర్వాత నా మృతదేహాన్ని ఇంట్లోనే సమాధి చేయండి. ఇదే నా చివరి కోరిక. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని నాకు లేదు… తమిళనాడులో రామస్వామి అనే వ్యక్తి చివరి కోరిక ఇదే. మీరు ఎన్ని బాధలు పడినా నేను మీతోనే కలిసి ఉండాలి అని అతను చెప్పడంతో కొడుకు అతని మాటను నెరవేర్చాడు. చెన్నై జిల్లాలోని జిల్లాలోని అమ్మాపాళయం సమీపంలో ఉన్న కలరంపట్టి గ్రామానికి చెందిన రైతు రామస్వామి (67) సోమవారం మరణించారు.

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ప్రాణాలు విడవగా ఈరోడ్ లో లారీ డ్రైవర్ గా పని చేస్తున్న కొడుక్కి సమాచారం అందించారు. దీనితో వెంటనే వచ్చి తండ్రి చివరి కోరిక నెరవేర్చాలని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఇంటి పెరట్లోనే సమాధి చేయాలని చూడగా ఇంటి పక్కన ఉన్న వారు వద్దని చెప్పారు. దీనితో ఇంట్లోనే సమాధి చేసాడు. సమాచారం అందుకున్న రేవేన్యు, పోలీసులు సిబ్బంది ఆ సమాధి తవ్వించి మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news