షాకింగ్ : అయోధ్య ట్రస్ట్ ఖాతాలో డబ్బులు మాయం..!

-

అయోధ్య రామమందిర బాధ్యతలు చూస్తున్న శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల్లో భారీగా డబ్బు మాయమైంది. ట్రస్ట్‌ కు చెందిన రెండు అకౌంట్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రెండు సార్లు భారీ మొత్తంలో సొమ్మును కాజేశారు. ఫోర్జరీ చెక్‌తో నగదును కాజేసినట్లు ట్రస్ట్ గుర్తించింది. సెప్టెంబరు 1న లక్నోలోని ఓ బ్యాంకు ఖాతా నుంచి 6 లక్షల రూపాయలను దుండగులు చెక్ ద్వారా డ్రా చేశారు. ఆ తరువాత రెండో సారి రెండు రోజుల తరువాత మరో రూ.3.5 లక్షలు విత్ డ్రా చేశారు.

ఈ క్రమంలో మూడోసారి కూడా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారి ఈ విషయాన్ని ట్రస్ట్ జనరల్ సెక్రటరీ సంపత్ రాయ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తాము ఎవరికీ చెక్కులు ఇవ్వలేదని సంపత్ రాయ్‌ స్పష్టం చేశారు. దీంతో వెంటనే ట్రస్ట్ ఖాతాల్లో నుంచి అన్ని రకాల చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. ఈ వ్యవహారంపై అయోధ్య పోలీస్ స్టేషన్‌లో ట్రస్ట్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news