రికవరీలో సరికొత్త రికార్డ్ సాధించిన ఇండియా…!

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా ఉన్నా సరే కరోనా కేసులు మాత్రం అసలు ఏ విధంగా కూడా ఆగడం లేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మన దేశంలో రికవరీ రేటు మాత్రం భారీగా పెరుగుతూ వస్తుంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 57 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో గ‌డచిన 24 గంట‌ల్లో 57,381 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కరోనా నుంచి ఇంత మంది ఒకే రోజులో కోలుకోవడం ఇదే తొలిసారి అని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు మాన్ దేశంలో 18 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే మన దేశంలో 8 లక్షల 68 వేలకు పైగా కరోనా టెస్ట్ లు చేసారు. ఢిల్లీలో 90 శాతం రికవరీ రేటు ఉండగా హర్యానాలో, తమిళనాడులో 80 శాతం పైగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news